Header Banner

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. నలుగురు అరెస్ట్! పట్టుబడిన వారిలో..

  Sat Jun 14, 2025 10:04        India

హైదరాబాద్‌లోని ప్రముఖ పబ్‌లలో మాదకద్రవ్యాల వినియోగంపై సైబరాబాద్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ) ఉక్కుపాదం మోపింది. నిన్న‌ రాత్రి గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లోని పలు పబ్‌లపై ఆకస్మిక దాడులు నిర్వహించి, గంజాయి సేవించిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకుంది. వీరిలో ఒక డీజే ప్లేయర్ కూడా ఉండటం గమనార్హం. నగరంలోని పబ్‌లలో డ్రగ్స్ వినియోగం జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు చేపట్టారు. ముఖ్యంగా గచ్చిబౌలిలోని ఎస్‌ఎల్‌ఎస్‌ టెర్మినల్‌ మాల్‌లో ఉన్న క్లబ్‌ రౌగ్‌ పబ్‌తో పాటు ఫ్రాట్‌ హౌస్‌ పబ్‌లు నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడుల్లో భాగంగా క్లబ్‌ రఫ్‌ పబ్‌లో ఉన్న కొందరు యువకులకు పోలీసులు అక్కడికక్కడే డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో నలుగురు యువకులు గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయింది. పట్టుబడిన వారిలో డీజే ప్లేయర్ శివ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

 

ఇది కూడా చదవండి: సక్సెస్ అంటే విజయం కాదు.. దాదాపు రెండేళ్లుగా! సమంత పలు ఆసక్తికర విషయాలు!

 

దీంతో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిన నలుగురినీ పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. పట్టుబడిన వారికి డ్రగ్స్ ఎలా సరఫరా అయ్యాయి, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. నగరంలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. పబ్‌లు, బార్ల యాజమాన్యాలు తమ ప్రాంగణాలను డ్రగ్-ఫ్రీ జోన్‌లుగా ప్రకటించాలని, మైనర్లకు మద్యం అమ్మకుండా, మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా నిరోధించాలని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని నైట్‌లైఫ్ హాట్‌స్పాట్‌లలో డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎస్ఓటీ బృందాలు నిరంతరం నిఘా ఉంచుతాయని, అనుమానిత కార్యకలాపాల గురించి ప్రజలు నిర్భయంగా సమాచారం అందించాలని అధికారులు కోరారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ని అడ్డుకున్న పోలీసులు! కార్యకర్తలు సుమారు 300 మంది!

 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..

 

ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగ అవకాశం!

ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..

 

ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!

 

రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!

 

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #Drugs #Hyderabad pubs #Drugs case #Cyberabad SOT #Gachibowli pubs #Madhapur pubs #Club Rogue pub #DJ Shiva #NDPS Act